గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ

నవతెలంగాణ అచ్చంపేట : లింగాల మండల పరిధిలోని పద్మనాపల్లి గ్రామంలో గామా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేషన్ కార్డు ఉన్న పేదలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఫౌండేషన్ సీఈఓ దుర్గాప్రసాద్ ఆదేశాల మేరకు ఫౌండేషన్ లో సభ్యత్వం ఉన్న పేదలకు 532 రూపాయల విలువగల సరుకులు జీవన భృతి కింద వెయ్యి రూపాయలు ప్రతినెల ఇవ్వడం జరుగుతుందని సీఎంఓ బొజ్యా నయక్ తెలిపారు. నాగర్ కర్నూల్ గద్వాల మహబూబ్నగర్, వనపర్తి, కరీంనగర్, నారాయణపేట, జిల్లాలలో ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు విస్తరించడం జరుగుతుందని వారు తెలిపారు.
Spread the love