కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన పలువురు లబ్ధిదారులకు మంజూరైన కళ్యాణలక్ష్మి చెక్కులను శుక్రవారం పంపిణీ చేశారు. ఈ మేరకు మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ అధ్యక్షురాలు లోలపు గౌతమి, తహసిల్దార్ ఆంజనేయులు  చేతుల మీదుగా లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఎంపీపీ అధ్యక్షురాలు గౌతమి మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు పెళ్ళికి  వరంగా మారిందన్నారు. దేశంలోనే ఈ పథకం ఆదర్శంగా నిలిచిందన్నారు. తహసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతూ మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 44మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి చెక్కులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కాలేరు శేఖర్, ఎంపిటిసి సభ్యుడు మైలారం సుధాకర్, కో ఆప్షన్ సభ్యుడు  అజ్మత్ హుస్సేన్, గ్రామ అభివృద్ధి కమిటీ  అధ్యక్షులు  మల్లేష్, డిప్యూటీ తహసిల్దార్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు మురళి, సుమన్, తదితరులు పాల్గొన్నారు.
Spread the love