పేదల పక్షపాతి సీపీఐ(ఎం) అభ్యర్ధులను గెలిపించండి – జిల్లా నాయకులు పుల్లయ్య

నవతెలంగాణ – అశ్వారావుపేట: పేదలు, వ్యవసాయ కూలీల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తున్న పేదలు పక్షపాతి సీపీఐ(ఎం) అభ్యర్ధులను అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ నాయకులు కొక్కెరపాటి పుల్లయ్య ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల పరిధిలోని గుర్రాల చెరువు పంచాయితీ లోని పలు ఆవాసాలు లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమలు కాని హామీలు, మాయమాటలు చెప్పే వాళ్ళను, ప్రతీ ఎన్నికల సమయంలో పార్టీలు మారే వారిని ఓడించాలని కోరారు.
విద్యార్ధి నాయకుడిగా రాజకీయాల్లోకి ఆకర్షితుడై నేటి వరకు సంఘటిత అసంఘటిత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం నిరంతరం ప్రజల్లోనే ఉంటున్న సీపీఐ(ఎం) అభ్యర్ధి అర్జున్ రావు పిట్టల ను గెలిపించి అసెంబ్లీకి పంపాలని విజ్ఞప్తి చేసారు. అనంతరం ప్రమాదానికి గురై చికిత్స పొందుతున్న పుల్లయ్య పరిచయస్తులు ను ఆయనతో పాటు అభ్యర్ధి అర్జున్ రావులు లు పరామర్శించారు.  ఈ కార్యక్రమంలో అభ్యర్ధి అర్జున్ రావు, మండల కమిటీ సభ్యులు మడిపల్లి వెంకటేశ్వరరావు, తగరం జగన్నాధం, కలపాల భద్రం, రాంచరణ్ లు పాల్గొన్నారు.
Spread the love