– పార్లమెంట్ సభ్యులకు కాంగ్రెస్, బీజేపీ విప్లు జారీ
న్యూఢిల్లీ: ఈ నెల 18 నుంచి 22 వరకు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలని బిజెపి, కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్లు జారీ చేశాయి. ఎంపీలు పార్లమెంట్కు హాజరు కావాలని, పార్టీ వైఖరికి మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ముఖ్యమైన బిల్లులపై చర్చించేందుకు, ప్రభుత్వ వైఖరికి మద్దతివ్వడానికి పార్లమెంట్కు హాజరు కావాలని బిజెపి తమ ఎంపీలను కోరింది. ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంట్ సమావేశాల్లో.. 75 ఏళ్ల పార్లమెంటు ప్రయాణం, విజయాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, రాజ్యాంగ సభ నుంచి ఇప్పటి వరకు ప్రయాణంపై ప్రత్యేక చర్చను ప్రభుత్వం ప్రక్రియలో జాబితా చేసింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకానికి సంబంధించిన బిల్లును కూడా ప్రభుత్వం ప్రొసీడింగ్స్లో జాబితా చేసింది. గత వర్షాకాల సమావేశాల్లోనే ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పాత భవనంలో కాకుండా కొత్త భవనంలో సభా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. లోక్సభకు జాబితా చేయబడిన ఇతర బిల్లులలో న్యాయవాదుల (సవరణ) బిల్లు, 2023 ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు, 2023 ఉన్నాయి. ఈ బిల్లులన్నీ ఇప్పటికే రాజ్యసభ ఆమోదించింది. ఇవే కాకుండా.. ‘పోస్టాఫీసు బిల్లు, 2023’ కూడా లోక్సభ ప్రొసీడింగ్స్లో జాబితా చేయబడింది. ఈ బిల్లును ఆగస్టు 10న రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ జాబితా తాత్కాలికమైనదని.. మరిన్ని అంశాలను జోడించే అవకాశముందని సంబంధిత వర్గాలు తెలిపాయి. పాత పార్లమెంట్ భవనంలో ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానుండగా.. మరుసటి రోజు కొత్త భవనంలో సభా కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 18న ప్రారంభమయ్యే ఐదు రోజుల పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు ముందుగా.. ప్రభుత్వం ఈ నెల 17న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.