పాఠశాలకు బెంచీలు అందజేత

నవతెలంగాణ – బొమ్మలరామరం   
గ్రామీణ పిల్లలు చదువుకుంటేనే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందని స్ట్రీట్ కాస్ ప్రెసిడెంట్ గ్రంధా అన్నారు. బొమ్మలరామరం మండలంలోని కంచల తండా గ్రామంలోని మండల పరిషత్ స్కూల్ కి స్ట్రీట్ కాస్ బృందం డెస్క్ బేంచెస్ అందజేయడం జరిగింది. ప్రతి పేదవాడు చదువుకోవాలని వారికి కావలసిన సహాయం చేసేందుకు స్ట్రీట్ కాస్ ఎస్ టి ఎప్పుడు ముందు ఉంటుందని,పేదలకు మంచి విద్య అందించాలనే గొప్ప లక్ష్యంతో ముందుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శోభారాణి,ఎంపీటీసీ ధీరవత్ శ్రీహరి నాయక్,యువతలు మలోత్ వినోద్, దీరవత్ సుమన్ నాయక్, ధీరవత్ శ్రీనివాస్ నాయక్, మాలోత్ రాజ్ కుమార్ నాయక్ , ఉడతల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
Spread the love