అధైర్య పడవద్దు ప్రభుత్వం అండగా ఉంటుంది

– శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు
నవతెలంగాణ – మల్హర్ రావు
మహాముత్తారం మండలంలోని యమాన్ పల్లి గ్రామానికి చెందిన కొండగొర్ల అంకమ్మ ఇటీవల అనారోగ్యంతో భూపాలపల్లి సురక్ష ప్రయివేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతుంది. ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ ఐటి, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సోదరుడు, శ్రీపాద ట్రస్ట్ ఛైర్మన్ దుద్దిళ్ల శ్రీనుబాబు మంగళవారం ఆసుపత్రికి వెళ్లి బాధితురాలను పరమార్శించి, అధైర్య పడవద్దు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందన్నారు. అంకమ్మ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితురాలుకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.
Spread the love