నాకు ఓటేయ్యకండి.. కాలనీ వాసులపై మల్లారెడ్డి అగ్రహాం

నవతెలంగాణ- బోడుప్పల్ :
సమస్య పరిష్కారం అడిగిన కాలనీ వాసులపై మంత్రి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నాడు పీర్జాదీగూడ, బోడుప్పల్ మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన మల్లారెడ్డిని పీర్జాదీగూడ మొదటి డివిజన్ ప్రగతి నగర్, అయోధ్య నగర్, హిమగిరి కాలనీల వాసులు అడ్డుకుని ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు. మాట్లాడుతూ చింతల చెరువు నుండి కలుషిత నీటిని మా కాలనీల్లో వదలడంతో తీవ్రమైన దుర్వాసన వస్తుందని  ఇక్కడ ఉండలేక పోతున్నామని కాలనీ వాసులు ఎదురు తిరిగారు. దీంతో ఆగ్రహానికి గురైన మల్లారెడ్డి నాకు మీ ఓటు అవసరం లేదంటూ విసుక్కోని వెళ్ళి పోయాడు.
Spread the love