దుదిల్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి

నవతెలంగాణ – పెద్దపల్లి
దుద్దిల్ల శ్రీపాదరావు సేవలు మరువలేనివి అని మదర్ తెరిస్సా ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ తొడుపునూరి శ్రీనివాస్ అన్నారు. శనివారం మదర్ తెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ శాసనసభ్యుడు, శాసనసభ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాద రావు జయంతి సభను నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల వ్యవస్థాపక అధ్యక్షుడు ఎడవల్లి కృష్ణ, చైర్మన్ ఎడవల్లి నవీన్ కుమార్, డైరెక్టర్ నవత, ప్రిన్సిపాల్ తొడుపునూరి శ్రీనివాస్ లు శ్రీపాద రావు చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా దుదిల్ల శ్రీపాద రావు సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ తొడుపునూరి శ్రీనివాస్ మాట్లాడుతూ.. 1935లో మంథని నియోజకవర్గంలో జన్మించిన శ్రీపాద రావు మంథని నియోజకవర్గానికి మూడుసార్లు ఎమ్మెల్యేగా, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో సేవలు చేశారని అన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల విభాగాధిపతులు, అకౌంట్స్ ఆఫీసర్ పవన్ కుమార్, విద్యార్థిని విద్యార్థులు, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ పాల్గొన్నారు.
Spread the love