Sunday, June 28, 2026
E-PAPER
Homeజాతీయంభారత్ లోనూ భూకంపం

భారత్ లోనూ భూకంపం

- Advertisement -


ఢిల్లీ ఎన్‌సీఆర్‌, 
ఉత్తర భారత్ లోనూ ప్రకంపనలు
పాక్, ఆఫ్గనిస్తాన్ లోనూ ప్రభావితం
ఢిల్లీ : ఆఫ్గ నిస్తాన్‌లోని హిందూ కుష్ ప్రాంతంలో 6.2 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది, దీని ప్రకంపనలు పాకిస్తాన్ , వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు వ్యాపించాయి. ప్రాథమిక భూకంప నివేదికల ప్రకారం,ఈ భూకంపం భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:04 గంటలకు భూమికి 215 కిలోమీటర్ల లోతులో సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.5 గా గుర్తించారు. ఇది భూమి లోపల చాలా లోతులో భూకంపం సంభవించడం వల్ల, ఉపరితల ప్రభావం చాలా వరకు తగ్గింది; అదృష్టవశాత్తూ, ప్రాణనష్టం లేదా నిర్మాణ నష్టం జరిగినట్లు తక్షణ నివేదికలు లేవు.
పాకిస్తాన్‌లో 5.4 తీవ్రతతో భూకంపం
జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ( ఎన్ సీఎస్ ) ప్రకారం, శనివారం పాకిస్తాన్‌లో 5.4 తీవ్రతతో భూకంపం సంభవించింది. అయితే, ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం అందలేదు. మరోవైపు ఆఫ్ఘ నిస్తాన్‌లో రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రతతో భూకంపం నమోదైంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -