- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్; మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ముఖేడ్ తాలూకాలో ఇవాళ భూకంపం సంభవించింది. దాదాపు 8 గ్రామాలు రిక్టర్ స్కేలుపై 3 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు సమాచారం. ఆకస్మిక ప్రకంపనలు ప్రజల్లో భయాన్ని రేకెత్తించాయి. దీంతో చాలా మంది ఇళ్ల నుండి బయటకు పరుగులు తీశారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం జరగనట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -



