– కేటీఆర్పై వ్యక్తిగత విమర్శలపై ఆగ్రహం
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధంగా మాట్లారంటూ ఎన్నికల సంఘం అగ్రహం వ్యక్తం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఈ నెల ఒకటిన వరంగల్లో మంత్రి చేసిన వ్యాఖ్యలను ఈసీ తప్పు పట్టింది. ఎన్నికల సమయంలో బహిరంగంగా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కమిషన్ హెచ్చరించింది. తమకు బీఆర్ఎస్ నేతల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి నుంచి సమాచారం తెప్పించుకుని పరిశీలించినట్టు పేర్కొంది. ఆరోపణలు చేసే సమయంలో బాధ్యతగా వ్యవహరించాలని సూచించింది. స్టార్ క్యాంపెయినర్, మంత్రిగా ఉన్న సురేఖ మరింత బాధ్యతగా ఉండాలని హితవు పలికింది.