చదువు ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు..

–  ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ రావు

నవతెలంగాణ నాగిరెడ్డిపేట్: చదువు ఉంటే ఏదైనా సాధించచ్చని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు స్పష్టం చేశారు. మంగళవారం నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో గల కేజీబీవీ పాఠశాల విద్యార్థినులకు ఆయన ఏకరూప దుస్తులు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి చదువుకుంటే ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చు అని ఆయన అన్నారు. చదువు ఉంటే ప్రతిదీ తమ వద్దకే వస్తుందని ఆయన అన్నారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు తెలివిమంతులుగా ఉంటారని కార్పోరేట్ పాఠశాలలో చదివిన వారు అంతంత మాత్రమే తెలివి కలిగి ఉంటారని ఆయన అన్నారు. నేటి సమాజంలో చదువుకు సాటి రానిది ఏదీ లేదన్నారు. పాఠశాలలు అభివృద్ధి పరిచి ఉన్నత విద్యను అందించడమే తన లక్ష్యమని ఆయన అన్నారు. ఈ పాఠశాలలో ఏ సమస్య వచ్చినా తాను ముందుండి సమస్యను పరిష్కరిస్తామని విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని ఆయన అన్నారు. ప్రతి పాఠశాలలో 17 వేలకే లాప్టాప్ అందించే విధంగా చర్యలు తీసుకున్నట్లు ఆయన అన్నారు ప్రతి పాఠశాలలో 1,20,000 తో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామని ఆయన అన్నారు. తాను కూడా గవర్నమెంట్ స్కూల్ అనే చదివి ఈరోజు 18 దేశాల్లో చుట్టి వచ్చినట్టు ఆయన అన్నారు.
200 కోట్లతో ఎల్లారెడ్డి అభివృద్ధి..
200 కోట్ల రూపాయలతో ఎల్లారెడ్డి అభివృద్ధి జరుగుతున్నట్లు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు అన్నారు తాజాగా నిన్నటి రోజు 36 కోట్లు మంజూరు చేయించినట్లు ఆయన అన్నారు. గ్రామాలలో చిన్నచిన్న సమస్యలను పరిష్కారం చేయడానికి అదే విధంగా గ్రామాలకు వెళ్లే బీటీ రోడ్లు అద్వానంగా ఉండటంతో వాటి మరవత్తులు చేయించడానికి నిధులను మంజూరు చేయించినట్లు ఆయన ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ టేకులపల్లి వినీత, జెడ్పిటిసి మనోహర్ రెడ్డి, ఎంఈఓ వెంకటేశం, ప్రిన్సిపల్ వీణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీధర్ గౌడ్, నాయకులు రామచంద్రారెడ్డి, విఠల్ రెడ్డి, బోయిని విఠల్, గంగారెడ్డి, వాసు రెడ్డి, ఇమామ్, దివిటీ కిష్టయ్య, లక్ష్మణ్, గులాం హుస్సేన్, నరసింహారెడ్డి, శేఖర్, గోపాల్, సురేందర్ గౌడ్, కిరణ్ బోయినీ హనుమాన్లు, సాయ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు..
గాంధారి మండలంలో తమకు వచ్చిన జీతాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకట్ కు అందజేయడంతో నాగిరెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  మదన్మోహన్ ను శాలువాతో సత్కరించారు. ఎన్నికల సమయంలో తాము జీతం చేసుకోకుండా ప్రజల కోసమే పని చేస్తానని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు వచ్చిన తన జీతాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వెంకట్ మరణించడంతో వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు.
Spread the love