యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దగ్ధం

నవతెలంగాణ – బొమ్మలరామారం

బొమ్మలరామారం మండల కేంద్రంలో మంగళవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. నిన్న రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పై వ్యాఖ్యలను ఖండిస్తూ దిష్టిబొమ్మ దగ్ధం చేసామని. బొమ్మలరామారం మండల ప్రజలంతా వారి నాన్న మీద ప్రేమతో ఓటు వేసి గెలిపించారని, జనరల్ బాడీ మీటింగ్ తప్ప ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి నోచుకోలేదని అన్నారు.పక్కనే ఉన్నటువంటి తన సొంత గ్రామం నుండి చీకటిమామిడి వరకు రోడ్డు వేస్తానని నమ్మించి మోసం చేశారని, మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్ నాయకుడు మర్రి భగవంతు రెడ్డి,జిల్లా యువజన ప్రధాన కార్యదర్శి దేశెట్టి చంద్రశేఖర్, బొబ్బిలి నర్సిరెడ్డి, యూత్ కాంగ్రెస్ నాయకులు రామిడి శ్రవణ్ ప్రసాద్ రెడ్డి,ఎంపీటీసీ హేమంత్ రెడ్డి, సర్పంచ్ రాంపల్లి మహేష్ గౌడ్,యంజాల కళ్,గ్రామ శాఖ అధ్యక్షుడు పైలెట్ రాజేష్, ముద్దం శ్రీకాంత్ రెడ్డి, నాయకులు ఈశ్వర్,కుమార్, బాబు,గోపికృష్ణ, శ్రవణ్ ,జెమిల్,ఉపేంద్రర్,అలిమ్,నాగరాజు, నరసింహ,రవి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Spread the love