జాతీయ స్థాయి పోటీల్లో ఐరిస్ విద్యార్థుల ప్రతిభ

నవతెలంగాణ – బొమ్మలరామారం

స్పీడ్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఇటీవల చెన్నైలో జరిగినరోలర్ స్కేటింగ్ జాతీయస్థాయి పోటీల్లో బొమ్మలరామారం మండలంలో యావపూర్ ఐరిస్ విద్యార్థులు రోలర్ స్కేటింగ్ పోటీలో విద్యార్థులు సత్తాచాటారు.పోటీల్లో కనబరిచినందుకు బంగారు,వెండి పతకాలు గెలుచుకున్నారు.5వ తరగతి డి,హర్ష, భరణి, తేజ,6వ తరగతి సంతోష్,9వ తరగతి మనోజ్ పథకం సాధించారు.అనంతరం డైరెక్టర్ R P సేత్ మాట్లాడుతూ…రోలర్ స్కేటింగ్ లో చిన్నారులు చిచ్చరపిడుగులే..కాళ్లకు స్కేటింగ్ ఘా కట్టుకుని బరిలోకి దిగారంటే పథకాలూ పరుగులు పెట్టాల్సిందే అని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ రుద్ర లక్ష్మి, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Spread the love