ప్రతి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండ 

నవతెలంగాణ- బొమ్మలరామారo

తెలంగాణ ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందిస్తుందని, పార్టీ కార్యకర్తకు ఎలాంటి ఆపద ఉన్న ముందుండి నడిపిస్తామని డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని ఫక్కిర్ గూడెం గ్రామంలో గత మూడు నెలల కితం వాగులో కొలిపాకు రమేష్ ప్రమాదవశత్తు నీళ్లలో మునిగి మరణించగా, ఆ కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పార్టీ సభ్యత్వం ద్వారా ప్రమాద బీమా రెండు లక్షల రూపాయలు చెక్కును కొలిపాక రమేష్ భార్య అరుణ కు డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి చేతుల మీదుగా రెండు లక్షల రూపాయల చెక్కును శనివారం అందజేశారు.ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ సునీత మహేందర్ రెడ్డి ఎంతో రుణపడి ఉంటామని బాధితులు కృతజ్ఞతలు తెలుపడం జరిగింది.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మెడ బోయిన గణేష్ ,ఎంపీటీసీ బోయిని లత నరసింహ, మల్లెబోయిన కిష్టయ్య, జే శంకరయ్య, బి పాండు, కొలిపాక వెంకటేష్, పైళ్ల లక్ష్మారెడ్డి, వెంకటేష్, పాండు ,కృష్ణ, మేడిపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు సిద్ధంకి శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది.
Spread the love