నవతెలంగాణ- చివ్వేంల: గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సిపిఐ మండల కార్యదర్శి ఖమ్మం రాము అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. సోమవారం గ్రామపంచాయతీ కార్మికులు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. గ్రామపంచాయతి కార్మికులకు సిపిఐ మండల కార్యదర్శి, ఖమ్మంపాటి రాము మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.