- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సహకారంతో ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రూ.20 లక్షల నిధులతో నూతన గ్రామ పంచాయతీ కార్యాలయ భవన నిర్మాణం పూర్తైందని చిన్న ఎక్లారా గ్రామ సర్పంచ్ మాధవరావు తెలిపారు. ఇందులో భాగంగా భవనం ప్రారంభోత్సవం ఈ నెల 13 ఉంటుందని, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే హాజరవుతున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో గ్రామ పెద్దలు, నాయకులు, అధికారులు గ్రామ పాలకవర్గం, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.
- Advertisement -



