నవతెలంగాణ-జైనథ్
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాజేంద్ర విజరు అన్నారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన పర్యటించారు. ముందుగా మండల కేంద్రంలోని పురాతన దేవాలయం శ్రీలక్ష్మినారాయణ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మండల కేంద్రంలోని పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసి, ప్రజలతో మమేకమై ఎన్నికల గురించి మాట్లాడుతూ వారికి ఎన్నికల గురించి ఎంత వరకు అవగాహన ఉందో లేదో తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. అతని వెంట సీఐ డి.సాయినాథ్, తహసీల్ధార్ శ్యామ్ సుందర్ ఉన్నారు.