నవతెలంగాణ – హైదరాబాద్: ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు, మాజీ మహిళా కమిషనర్ స్వాతి మాలివాల్పై దాడి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వ్యక్తిగత సహయకుడు బిభవ్ కుమార్ జ్యుడీషియల్ కస్టడీని మరోసారి జులై 6వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు తీస్ హజారీ కోర్టు స్పష్టం చేసింది. బిభవ్ కుమార్ను శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తీస్ హజారీ కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.మే 13 న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఎంపీ స్వాతి మలివాల్పై బిభవ్ కుమార్ దాడి చేశారు. అనంతరం అతడిపై పోలీసులకు స్వాతి మలివాల్ ఫిర్యాదు చేసింది.