మెదడు గుడ్డిదయినప్పుడు కళ్లుండి లాభం లేదు!

Eyes are useless when the brain is blind!ఖుద్‌ గలత్‌ హోకర్‌ ఖుద్‌ కొ నహీ..!
సాబిత్‌ కర్‌నా ఇతనా ముష్కిల్‌ నహీ హోతా
జిత్‌నా సహీ, హోకర్‌, ఖుద్‌కొ సహీ.., సాబిత్‌ కర్‌నా-

తప్పు చేసి, చేసిన పని సరైనదేనని నిరూపించుకోవడం ఏమంత కష్టమైన పనికాదు. సరైన పని చేసి, చేసింది సరైనదే అని నిరూపించుకోవడం. ఈ రోజు ల్లో చాలా కష్టం! అని పై చరణాలకు అర్థం.
‘ఇదీ భారత్‌! ఇండియా కాదు’ అని అంటా డొకడు. తాజ్‌మహల్‌ను తేజోమహల్‌ అని అంటా నంటాడొకడు. అసలు యహుదీ-అనే పదమే తప్పు -దాన్ని యాదవ అని అనాలని అంటాడు- ఇంకొ కడు-ఇక భార్యను హత్య చేసి తత్త్వవేత్తగా మారిన వాడొకడు ఆస్ట్రేలియాను అస్త్రాలయా అని పిలవాలం టాడు. ఇంతమంది మేతావులు ఈ దేశంలో ఎందుకు పుట్టు కొచ్చారంటే – ఆరో తరగతిలో స్కూల్లో పేరు తీసేస్తే పోయి. లేని రైల్వే స్టేషన్లో చారు అమ్ముకున్నానన్నవాడు యం.ఎ.డిగ్రీ కొను క్కుని వచ్చి పరిపాలకుడైనందుకు! ఓ చోట తల్లిని, మరో చోట భార్యను విడివిడిగా వదిలేసి, నైతికత అనేది లేకుండా జాగ్రత్త పడి – శూద్రుడై ఉండి మనువాద పల్లకీ మోస్తున్నందుకు!! ప్రపంచ దేశాలు బలాదూరు తిరుగుతూ ‘విశ్వగురువు’ నయ్యా ననే భ్రమలో బ్రతుకుతున్నందుకు!! దేశం ప్రమాదకర స్థితిలోకి దిగజారిపోయింది – మెదడు గుడ్డిదయినప్పుడు కళ్లుండి లాభం లేదని అంటున్నది ఇందుకే.
దేశం ఈ స్థితికి రావడానికి మూల కారణం ఆరెస్సెస్‌ సంస్థ. అది ఎలాంటిదో అది ఎన్నెన్ని ఘనకార్యాలు వెలగ బెట్టిం దో చూడండి. 1925లో ఆరెస్సెస్‌ స్థాపన జరిగింది. 1930 మార్చిలో ఉప్పు సత్యాగ్రహం జరిగినప్పుడు. అందులో ఆరెస్సెస్‌ పాల్గొనదని తేల్చి చెప్పాడు హెడ్గేవార్‌! పైగా 1940 డిసెంబర్‌లో బ్రిటీష్‌ వారి ‘ఇంపీరియల్‌ సివిల్‌ గార్డ్‌’లో చేరిన ఆరెస్సెస్‌, వారికి భజన చేసింది. 1942 ఆగష్టులో క్విట్‌ ఇండి యా ఉద్యమం ఊపందుకున్న ప్పుడు తాము అందులో పాల్గొ నమని ఆరెస్సెస్‌ స్పష్టం చేసింది. 1947 ఆగష్టులో దేశానికి స్వాతంత్య్రం లభించిన ప్పుడు, మువ్వన్నెల త్రివర్ణ పతాకాన్ని తాము జాతీయ జెండాగా గౌరవించమని ఆరెస్సెస్‌ ప్రకటిం చింది. చాలా కాలం వారు దాన్ని ఎగురేయలేదు. అదీ వారి దేశభక్తి! 1948 జనవరిలో గాంధీని చంపిన వాడెవరూ? ఆరెస్సెస్‌ కార్యకర్త గాడ్సేనే కదా? ఇది బహిరంగ రహస్యమే కదా? 1948 ఫిబ్రవరిలో చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్న సంస్థగా గుర్తించబడి ఆరెస్సెస్‌, భారత ప్రభుత్వ నిషేధానికి గురైంది. 1949 నవంబర్‌లో మనుస్మృతిని తప్పించి – అంబే ద్కర్‌ రాసిన భారత రాజ్యాంగాన్ని ఒప్పుకోమని ఆరెస్సెస్‌ బహి రంగంగా ప్రకటించింది. 1951 ఫిబ్రవరిలో మహిళ లకు సమాన హక్కులు ప్రసాదించే ‘హిందూ కోడ్‌ బిల్‌’ను ఆరెస్సెస్‌ వ్యతిరెకించి- దేశవ్యాప్త్తంగా నిర సన ప్రదర్శనలు చేపట్టింది. ఇవన్నీ నిశితంగా పరిశీలిస్తే ఏమనిపిస్తుంది? మెదడు గుడ్డిదయి నప్పుడు కళ్లుండి లాభం లేదని అనిపించడం లేదా?
ఇస్రో చంద్రుడి ఉపరితలాన్ని ఫొటోలు తీయగ లుగుతుంది. కానీ 140 కోట్లకు పెరిగిన భారత దేశ జనాభాలో ఉన్న మూర్ఖుల మెదళ్లలోని ముర్ఖ త్వాన్ని ఇంకా మనం ఫొటో తీయలేకపోతు న్నాం. చంద్రయాన్‌-3 విజయవంతమైంది గనక, అక్కణ్ణించి దేవుణ్ణడిగి మాకు వర్షాలు ఎప్పుడు కురుస్తాయో అడిగి చెప్పాలని – బీహారు కు చెందిన ఒక వ్యక్తి =ు× ఆక్ట్‌ కింద దరఖాస్తు చేసుకున్నాడు. సామాన్యుల్లో ఉంటే అర్థం చేసుకోవచ్చు – కానీ మూర్ఖత్వం ప్రముఖుల్లో ఉంటే దాన్ని ఏమనాలి? ఉదాహరణకు ఉత్తరప్రదేశ్‌లో ఒక ణ+ూ రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశాడు. హిందూ పంచాంగాన్ని అను సరించి విధులు నిర్వహించాలన్న ఆదేశా లతో పాటు రాష్ట్రంలోని అన్ని పోలిస్‌ స్టేష న్లకు పంచాంగాలు పంపిణీ చేశాడు. పోలీ సులు పంచాంగాలు చూసుకుంటారు సరే – మరి దొంగలు, నేరగాళ్లు పంచాంగాల ప్రకారం నేరాలు చేయరుకదా? మెదడు గుడ్డిదయినప్పుడు కళ్లుండి లాభం లేదు కదా? చంద్రయాన్‌-3 విజయవంతం కాగానే చంద్రుణ్ణి ‘హిందూదేశ్‌’గా ప్రకటిం చాలని చక్రపాణి అనే స్వామి ప్రకటిం చాడు. లోగడ చంద్రయాన్‌-2 కూలిపో యిన చోటుకు ‘తిరంగా పాయింట్‌’ అనీ చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విజయవం తంగా దిగిన చోటుకి ‘శివశక్తి’ అని మోడీ ప్రభుత్వం పేర్లు పెట్టింది. తొలిసారి చంద్రుడి మీదికి మతాన్ని చేర్చగలిగామని చంకలు గుద్దుకుంది. అలా ఇష్టం వచ్చిన పేర్లు పెట్టడానికి వీలుండదు. దానికి అంతర్జాతీయ ప్లానిటరీ బాడీ విధించిన నియమాలు నిబంధనలూ కొన్ని ఉంటాయి. మూర్ఖత్వం వదు లుకున్న వారికి మాత్రమే కదా విషయాలు అర్థమయ్యేదీ? చంద్రయాన్‌-3లో వెళ్ళిన యాత్రికులకు సెల్యూట్‌ చేస్తున్నానని ప్రకటించాడొక బీజేపీ మంత్రి. ఆస్ట్రనాట్స్‌ ఎవరూ వెళ్ళలేదన్న విషయం కూడా ఆ మహాపురుషుడికి తెలియదన్నమాట!
కాంగ్రెస్‌ పాలనలో చైనా మన దేశపు 43,000 కి.మీ. భూమిని ఆక్రమించింది అని అన్నాడు బీజేపీ అధ్యక్షుడు జె.పి. నడ్డా. భూమి చుట్టు కొలతే 40,075 కి.మీ. అయితే, అంత కన్నా ఎక్కువ భారత భూభాగాన్ని చైనా ఎలా ఆక్రమించిందీ? మన దేశపు మొత్తం భూభాగం ఉన్నదే – 32,87,263 చ.కి.మీ.లు (ూQఖA=జు ఖవీ) నడ్డా 43 వేల చదరపు కిలో మీటర్లు అని అనాల్సింది. అంత తెలివే ఉంటే బీజేపీ పార్టీకి అధ్యక్షుడెట్లా అవుతాడూ? అని దేశ ప్రజలు నవ్వుకున్నారు. చుట్టు కొలత కిలో మీటర్లలో చెపుతాం. విస్తీర్ణం చదరపు కిలో మీటర్లలో చెపుతాం. బీజేపీ మేధావులు మెదళ్లుమూసుకుని, తమ కళ్లు తెరిచే ఉన్నాయని అనుకుంటారు. మహిళలు బట్టల్లేక పోయినా అందంగానే ఉంటారంటూ – పతంజలి బాబా రామ్‌దేవ్‌ వ్యాఖ్యానించాడు. మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌ భార్య పైన కూడా కామెంట్‌ చేశాడు. ఆమెకు వందేళ్ళ వరకు ముసలితనం రాదని సర్టిఫికేట్‌ ఇచ్చాడు. మెదడ్లు మూసు కున్న పరిపాలకులకు ఆశ్రితులు మెదడ్లు లేని మూర్ఖులే ఉంటారు. పైగా వాళ్లు మెల్లె కళ్ళతో చూసినా వాళ్ళేమీ చూడలేరు.
”ఒక దేశానికి ఇంకో దేశానికీ మధ్య యుద్ధం జరుగుతు న్నప్పుడు తటస్థంగా ఉండడమో – ఏదో ఒక దేశానికి మద్దతి వ్వడమో చేయవచ్చు. కానీ, ఒక దేశానికి ఒక ఉగ్రవాద సంస్థకి యుద్ధం జరుగుతున్నప్పుడు బుద్ది ఉన్నోడెవడైనా ఉగ్రవాద సంస్థకి మద్దతిస్తాడా? మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ పార్టీని ఆరు దశాబ్దాలు భరించడం మా తప్పైపోయింది. ఇక మీదట ఆ అదృష్టం మాకొద్దులే నాయనా? అని ఒక తెలుగు సినీ గేయ రచయిత పరోక్షంగా కాంగ్రెస్‌ను విమర్శిస్తూ ఒక ప్రకటన చేశా డు. అతను జై శ్రీరామ్‌ అనలేదు గానీ, తానే ఆ శ్రీరామ్‌ అయి నంతగా తన బత్తాయిరంగు ప్రదర్శించాడు. అయితే కాంగ్రెస్‌ పాలస్తీనా ప్రజలకు మద్దతిచ్చిన విషయం తెలుసుకోకుండా విమ ర్శించడం సరికాదని అనేక మంది బుద్ది చెప్పారు. బుద్ది ఉన్నోడెవడో లేనోడు ఎవడో అక్కడే అర్థమ యింది. మిడిమిడి జ్ఞానంతో, వాట్సప్‌ యూనివర్సిటీ పట్టభద్రు లు ఈ మధ్య ఇలాగే రెచ్చిపోతు న్నారు. సినిమా పాటలు రాసినా, మరోవైపు సాహిత్య రంగంలో కూడా విశిష్టమైన కృషి చేసిన మహనీయులకే దొరకాల్సిన గౌర వం దొరుకుతుంది. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అంటూ తమ అల్పత్వాన్ని ప్రదర్శించుకుం టూ ఉంటారు. చంద్రయాన్‌-3ని కూడా కొందరు మోసగాళ్లు తమ స్వార్థానికి వాడుకుంటున్నారు. ఆ ప్రాజెక్ట్‌ విజయవంతం కావడానికి ‘రైస్‌ పుల్లింగ్‌’ కారణమనీ- అందు కు ఉపయోగించిన పాత్ర తమవద్ద ఉందంటూ కొందరు-ఓ హైదరాబాదు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి నుంచి ఇరవై కోట్ల రూపాయలు కొట్టేశారు. అతను లబోదిబో మని మొత్తుకుని, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు కేసు నమోదు చేసుకుని, దర్వాప్తు చేసి, నలుగురు నిందితుల్ని పట్టు కున్నారు. అణ్వాయుధాల్లోను శాటిలైట్స్‌లోనూ ఉపయోగించే రాగి చెంబు తమ వద్ద ఉందంటూ వారు జనాన్ని మోసం చేస్తు న్నారని పోలీసులు స్కామ్‌ బయట పెట్టారు. మోసగాళ్లు చెప్పారు సరే మరి – అంత ధనవంతుడైన ఆ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారికి మెదడెందుకు పనిచేయలేదు? కనీసమైన ఇంగిత జ్ఞానం, లోకజ్ఞానం లేకుండా కూడా కోట్లు సంపాదించొచ్చా? మెదడు గుడ్డిదయితే అంతేనేమో!
భార్య, భర్తకు కాళ్లు ఎందుకు నొక్కాలి? అనే విషయం మీద ఒక పైత్యేషు శర్మ ఇలా వివరణ ఇచ్చాడు – సంప్రదాయ బద్దమైన ఆ వివరణ విని దైవభక్తులంతా ముచ్చట పడ్డారు. ”పురుషులకు కాలి వేళ్ళ నుండి మోకాళ్ల వరకు ఉన్న భాగం శనిది. స్త్రీల చేతి వేళ్ళ కొసల నుండి అరచేయి వరకు ఉన్నభాగం శుక్రుడిది. భార్య, భర్త కాళ్లు పట్టడం ద్వారా శనిపై శుక్రుడి ప్రభా వం పడి ఆ ఇంట ధన ప్రాప్తి కలుగుతుంది!” చాలా పకడ్భందీ గా సమాధానం కూర్చుకున్నారు గానీ, శనినీ, శుక్రుణ్ణీ నమ్మే దెవరు? మెదడు గుడ్డిదయిన వాళ్లు తప్పు? అందుకే ఎవరో సరిగానే చెప్పారు. ”పురుషులు పురుషులకోసం ఏర్పరచుకు న్నవే ఈ మతాలన్నీ” అని! ఈ మధ్య మహిళా ప్రవచనకారి ణులు కూడా పెరిగిపొయ్యారు. అలాంటావిడ ఇలా చెప్పింది. భర్త, భార్యను ‘ఒసేరు’ అని పిలవడంలో ఎంతో గౌరవ ముందట! ఒసేరు-అంటే ఇంటి యజమానురాలా-అని అర్థ మట. అలాగయితే ఆ వీధిలో పోయేవాళ్లంతా ఈ విషయం చెప్పినావిణ్ణి ఒసేరు! అని పిలుచుకుంటూ పోతే సరి! ఆమెకు బోలెడంత గౌరవం దక్కుతుంది కదా?
మెదళ్లు గుడ్డివైపోయిన మతవిశ్వాసకుల మనస్తత్వాన్ని ఎత్తి చూపే సంఘటనలు ఎన్నో జరుగుతుంటాయి. అయితే, న్యూ యార్క్‌ స్టేట్‌లో జరిగిన ఒక సంఘటన ఇలా ఉంది. 1820 లో ఉత్తర న్యూయార్క్‌ స్టేట్‌లోని ఒక సరస్సు పక్కన ఒక మత బోధకురాలు ఉండేది. ఆమెకు అసంఖ్యాకంగా అనుచర గణం ఉండేది. ఆమె మీద వారికి ఎంతో విశ్వాసం. ఒకసారి ఆమె నీటి మీద నడుస్తానని ప్రకటించింది. నడవబోయే రోజూ, సమయం కూడా ప్రకటించింది. అంతే! ఆరోజుకు, ఆ సమయానికి లెక్క లేనంతమంది ఆ సరస్సు చుట్టూ చేరారు. ప్రకటించిన సమ యానికి ఆ మత ప్రచారకురాలు అక్కడికి వచ్చింది. అనుచరుల్ని సంతృప్తిగా చూసుకుంది. నవ్వుతూ నాలుగు వైపులా చెయ్యి ఊ పింది. అనుచరగణం ఉత్సాహంగా కేకలేసింది. మత ప్రచారకు రాలు అక్కడి జనాన్ని ఉద్దేశించి బిగ్గరగా ఇలా అడిగింది. ”నేను ఈ సరస్సులోని నీటి మీద నడుస్తానని మీరు నమ్ముతున్నారా?” అని అంది. అనుచరులంతా ఏకకంఠంతో ‘అవునూ అవునూ’ అని అరిచారు. ఉత్సాహంగా చప్పట్లు చరిచారు. ”అయితే సరే – మీకు ఆ నమ్మకం ఉండడమే ముఖ్యం! మీకు అంత నమ్మకం ఉన్నప్పుడు ఇక నేను నడవకపోయినా ఫరవాలేదు” అని మత ప్రచారకురాలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయింది! అనుచరులు కూ డా నిరుత్సాహంగా వెళ్ళిపోయారు. ఈ సంఘటన వల్ల మనకేం తెలుస్తోంది? విశ్వాసాన్ని బలపరుచుకోవడానికే మత ప్రచార కులు ప్రాధాన్యమిస్తారు. తప్పించి, చెప్పింది చేసి చూపలేరు. ఇక నిజ నిర్ధారణకు నిలదీయనివారే మత విశ్వాసకులవుతారు! పైగా తమకు తాము భక్తులమని మురిసిపోతుంటారు. మెదడు గుడ్డిదయినప్పుడు…ఇక అంతే!!
– సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త
(మెల్బోర్న్‌ నుంచి)
డాక్టర్‌ దేవరాజు మహారాజు

Spread the love