ఆగస్టుకంటే ముందే రైతు రుణమాఫీ: డిప్యూటీ సీఎం బట్టి

నవతెలంగాణ – హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ ఆగస్టుకు ముందే చేసి చూపిస్తామని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని స్పష్టం చేశారు. రైతు భరోసాపై విధివిధానాలు రూపొందించి, అసెంబ్లీలో చర్చించి అమలు చేస్తామని తెలిపారు.

Spread the love