జర్నలిస్ట్ కుటుంబానికి అండగా తోటి జర్నలిస్టులు

– సహృదయం చాటిన పరుపాటి శ్రీనివాస్ రెడ్డి
– కీశే రవీంద్ర చారి డబల్ బెడ్రూం నిర్మాణానికి ఆర్థిక సాయం
నవతెలంగాణ – రాయపర్తి
రాయపర్తి మండలకేంద్రానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ కీర్తిశేషులు వలబోజు రవీంద్రాచారి డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణానికి ఎస్ఆర్ఆర్ సంస్థల అధినేత పరుపాటి శ్రీనివాస్ రెడ్డి రూ.20,000/, రాయపర్తి మండల జర్నలిస్టులు రూ.36,000/ ఆర్థిక విరాళాని సేకరించి మంగళవారం ఆర్థిక సహాయం అందచేశారు. ప్రతి ఒక్క జర్నలిస్ట్ కుటుంబానికి అండగా ఉంటామని మండల జర్నలిస్టు సోదరులు తెలిపారు. జర్నలిజం అంటేనే ఆదర్శానికి నిదర్శనం అని దానిని నిరూపించడానికి తమ వంతు కృషి చేస్తుంటామని అన్నారు. జర్నలిస్టు రవీంద్రాచారి కుటుంబానికి ఆర్థిక సాయం చేసిన జర్నలిస్టు మిత్రులు మహమ్మద్ అఫ్సర్ పాషా  (నమస్తే తెలంగాణ), బొమ్మెర యాదగిరి (ఆంధ్రజ్యోతి), గిరక సురేష్ (దిశ), మచ్చ రాజు (ఈనాడు), మాచర్ల పరమేశ్వర్ (నవతెలంగాణ), పరుపాటి కిరణ్ కుమార్ రెడ్డి (రాజ్ న్యూస్), పోగులకొండ అశోక్ (ఐ న్యూస్), మహమ్మద్ ఇబ్రహీం (ఏవి న్యూస్), పంతంగి వేణు (క్యూ న్యూస్), పల్లె రాజేందర్ (దిశ), మునుగోటి అనిల్ కుమార్ (ఎన్ టీవీ), పసులాది నరేష్ (ప్రైమ్ 9 న్యూస్), గారె సందీప్ (వార్త), బరిగల శివ (జై భీమ్ సంస్థల చైర్మన్), ముద్రబోయిన శ్రీకాంత్ (జనం సాక్షి), కొండపల్లి ప్రసాద్ రావు (మనం న్యూస్), ఐత మల్లేష్ (వుదయం), గారె శ్రీనివాస్ (మన తెలంగాణ) తదితరులు పాల్గొన్నారు.
Spread the love