ముస్లిం వితంతు మహిళలకు ఆర్థిక సహయం: ఖాజా ఇస్రార్ అహ్మద్

నవతెలంగాణ – సూర్యాపేట
పవిత్ర రంజాన్ పండుగ సందర్భముగా సూర్యాపేట నియోజకవర్గంలో ఉండే ముస్లిం వితంతు మహిళలకు ది హైదరాబాద్ జకాత్ & ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆర్థిక సహయం అందజేయుటకు ట్రస్ట్ వారు నిర్ణయించినారని ఖాజా ఇస్రార్ అహ్మద్  తెలిపారు. సోమవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 34 సంవత్సరాల లోపు వున్న ముస్లిం వితంతు మహిళలు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకొవాలని కోరారు. పూర్తి వివరాలకు స్థానిక 44 వార్డు లో తన ఫోన్ నెంబర్ కు 9848408028 సంప్రదించాలని పేర్కొన్నారు.
Spread the love