Monday, June 1, 2026
E-PAPER
Homeజాతీయంకేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఢిల్లీలోని కేంద్ర విద్యాశాఖ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. వికాస్‌మార్గ్‌లోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ భవనం రెండో అంతస్తులో ఈ ఉదయం మంటలు చెలరేగాయి. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అయితే పలు దస్త్రాలు కాలిపోయాయని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన అంతస్తులో విద్యాశాఖ కార్యాలయాలు, అధ్యాపకుల క్యాబిన్‌లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఏసీ నుంచి మంటలు చెలరేగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -