మియాపూర్ మెట్రో రైల్ డిపోలో అగ్నిప్రమాదం

నవతెలంగాణ – హైదరాబాద్ : మియాపూర్ లోని మెట్రో రైల్ డిపోలో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. డిపోలోని చెత్త డంపింగ్ ఏరియాలో మంటలు తీవ్రంగా చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన మెట్రో రైల్ సిబ్బంది ఫైర్ డిపార్ట్ మెంట్ కు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్నిప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదానికి కారణాలను గుర్తించేందుకు మెట్రో రైల్ అధికారులు ఆరా తీస్తున్నారు.

Spread the love