మధ్యప్రదేశ్ సచివాలయంలో అగ్ని ప్రమాదం

 

నవతెలంగాణ – భోపాల్‌: మధ్యపద్రేశ్‌ రాజధాని భోపాల్‌లోని రాష్ట్ర సచివాలయం ‘వల్లభ్‌ భవన్‌’లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనంలోని మూడో అంతస్తులో ఈరోజు ఉదయం మంటలు చెలరేగాయి. భవనం నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో గుర్తించిన పారిశుద్ధ్య కార్మికులు వెంటనే అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని, 20 అగ్నిమాపక యంత్రాలతో సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు. ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని స్పష్టం చేశారు. మూడో అంతస్తులో భద్రపర్చిన కొన్ని కీలక డాక్యుమెంట్లు కాలిపోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Spread the love