నవతెలంగాణ – జుక్కల్
మండలంలో ఎమ్మెల్యే తోటలక్ష్మీకాంతారావ్ క్యాంపు ఆఫీస్ లో జెండా ఎగురవేయగా, ప్రభూత్వ కార్యాలయాలలో, పాఠశాలలో, సంక్షేమ వసతి గృహలు, పోలీస్ స్టేషన్, గ్రామ పంచాయతీ కార్యాలాయాలలో 75వ స్వాతంత్య దినోత్సవ వేడుకలను శుక్రవారంనాడు ఘణంగా నిర్వహించారు. ఈ సంధర్భంగా జుక్కల్ జీపీలో సర్పంచ్ బొంపెలి రాములు , జడ్పీహెచ్ఎస్ లో హెచ్ఎం హన్మంత్ రెడ్డి, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో నరేష్ , తహసీల్దార్ కార్యాలాయంలో గంగాసాగర్ , పోలీస్ స్టేషన్లో ఎస్సై సత్యనారాయణ, గ్రంథాలయం, పశువుల ఆసుపత్రి, కో-ఆపరేటివ్ సోసైటిలో, ఎస్సీ హస్టల్, బీసీ బాలీకల హస్టల్, బీసీ ఖండేభల్లూర్, ఎస్టీ కౌలాస్ హస్టల్ తో పాటు మండలంలోని ముప్పై జీపీలలో, వ్వవసాయ శాఖ, ఉపాదీహమీ , ఐకేపీ, 52 అంగన్ వాడీ కేంద్రాలలో స్యాంతంత్యదినోత్సవం పురస్కరించుకుని జాతీయజెండావిష్కరణ చేసి దేశభక్తీని చాటిచెప్పారు. కార్యక్రమంలో ఆయాగ్రామాల సర్పంచులు, అధికారులు పాల్గోన్నారు.