మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఏర్పాటు

నవతెలంగాణ- భీంగల్
  మండల పాస్టర్ అసోసియేషన్ నూతన  కార్యవర్గాన్ని శుక్రవారం ఎన్నుకున్నారు పట్టణంలోని ది లివింగ్ గాడ్ చర్చ్ లో రెవరెండ్ డాక్టర్ జి ప్రేమ్ కుమార్ అధ్యక్షతన  జరిగిన మండల పాస్టర్ అసోసియేషన్ సమావేశంలో నూతన అధ్యక్షుడిగా రిక్క దేవదాస్ ను ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఉపాధ్యక్షులుగా మాణిక్యాల ఏలియా, ప్రధాన కార్యదర్శిగా బోయిడి సుధాకర్, సంయుక్త కార్యదర్శిగా పి .జీవరత్నం, కోశాధికారిగా మోహన్,  సలహాదారులుగా డి సామ్యేల్, సిహెచ్ ఇజ్రాయిల్, డేవిడ్ రాజ్  లను ఎన్నుకున్నారు. ఈ కార్యవర్గ ఎన్నికల పరిశీలకులుగా క్రిస్టియన్   డెవలప్ మెంట్ ఫోరం బాల్కొండ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి సిహెచ్ ఇజ్రాయిల్, డి సామ్యూల్, జి. ప్రేమ్ కుమార్, చెంగల్ డేవిడ్ రాజులు వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దైవజనులు టి. సామ్యూల్, జేమ్స్, నెల్సన్, ఇమ్మానుయేల్, ఫిలోమెన్ డానియల్ నోవా, లాజర్, పాల్ డేవిడ్, విజయ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత పాలకవర్గం,  అధ్యక్షుడు జి ప్రేమ్ కుమార్ సేవలను కొనియాడారు.
Spread the love