మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ గుండెపోటుతో మృతి

నవతెలంగాణ – ఆర్మూర్ 

మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ చికిత్స పొందుతూ గుండెపోటుతో శనివారం ఉదయం మృతి చెందారు. జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాలకు స్వపరిచియుడు. వేల్పూర్ లో 1948 సెప్టెంబర్ 27న జన్మించారు. ఆయన పెద్ద కుమారుడు సంజయ్ నగర మాజీ మేయర్ కాగా, చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ నుండి ఎంపీగా రెండవసారి ఇటీవల ప్రమాణస్వీకారం చేశారు. డిఎస్ 1989,99, 2004 లో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2013 నుండి 2015 మధ్య ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి, బీఆర్ఎస్ పార్టీలో చేరి అనారోగ్య కారణాలతో గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షునిగా సేవలు అందించారు. ప్రభుత్వ సలహాదారునిగా, రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. ఆయన మృతితో స్వస్థలం అయినా వేల్పూర్ లో, ఆర్మూర్ నియోజక వర్గంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
Spread the love