నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర పౌరసరఫరాలశాఖలో జరిగిన కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి హస్తం ఉందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రైస్ టెండర్లు, ప్యాడీ టెండర్లు రద్దయ్యాయా? లేదా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి పౌర సరఫరాలశాఖపై ఎందుకు సమీక్షించడం లేదో చెప్పాలన్నారు.