- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండలంలోని ఎక్లార పెద్ద రాచోటె పర్భన పటేల్ కుమారుడు అశోక్ పటేల్ గత కొన్ని రోజుల క్రితం హఠాత్తుగా గుండె పోటుతో మరణించారు. విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదివారం వారి స్వగృహనికి వెళ్లి పరామర్శించారు. కుమారుడి మృతి గురించి తండ్రిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే షిండే తో పాటు మద్నూర్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బన్సి పటేల్, మండల ప్రధాన కార్యదర్శి గోవింద్ పటేల్ , సీనియర్ నాయకులు పండిత్ రావు పటేల్, యువ నాయకులు ప్రదీప్ పటేల్, తదితరులు ఉన్నారు.
- Advertisement -



