మైనారిటీలకు గ్రూప్ 1లో ఉచిత శిక్షణ: యాకూబ్ పాషా

నవతెలంగాణ – పాల్వంచ
గ్రూప్ -1, రాస్తున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ వారు ఈ నెల 15 నుంచి ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు భద్రాద్రి జిల్లా మైనారిటీ అధ్యక్షులు యండి.యాకూబ్ పాషా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిక్షణ హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద గల ఉర్దూ మస్కాన్ హాల్ నందు ఇవ్వడం జరుగుతుందని, ఈ శిక్షణలో పాల్గొనే వారందరికీ ఉచిత మెటీరియల్ కూడా అందిస్తారని  పేర్కొన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 040-23236112,  8520860785 లకు సంప్రదించాలని కోరారు.
Spread the love