గ్యాస్ లీకై తప్పిన పెను ప్రమాదం

నవతెలంగాణ – శంకరపట్నం
గ్యాస్ లీక్ అయి తప్పిన పెను ప్రమాదం  ఘటన  పూర్తి వివరాల ప్రకారం శంకర పట్నం మండల పరిధిలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన దేవునూరి పోచమ్మ (55)కు,చెందిన ఇండియన్ గ్యాస్ శనివారం  ఇంట్లో స్టవ్ అంటించగా వెంటనే గ్యాస్ లీకై మంటలు చెలరేగి ఇంట్లో ఉన్న సామాగ్రి పూర్తిగా ధ్వంసం  బాధితురాలు తెలిపారు. ఇంట్లో మంటలు రేగడంతో చుట్టుపక్కల వారు చూసి గ్యాస్ మెద్దు ను బయటపడేయడంతో పెను ప్రమాదం తప్పింది బాధితురాలికి సుమారు 20 వేల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితురాలు కన్నీరు మున్నీరు అయింది వెంటనే ఇండియన్ గ్యాస్ డీలర్ నష్టపరిహారం బాధితురాలికి వెంటనే చెల్లించాలని వేడుకొంది .
Spread the love