ఘనంగ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు

– రెపరేపలాడిన మూడు రంగుల మువ్వేన్నేల జెండా
– పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు
నవ తెలంగాణ – మల్హర్ రావు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండల కేంద్రమైన తాడిచెర్ల తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ రవి కుమార్, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి చింతలపల్లి మలహల్ రావు, పిఏసిఎస్ కార్యాలయంలో వైస్  చైర్మన్ ప్రకాష్ రావు తోపాటు మండలంలోని అన్ని గ్రామాల్లో వివిధ రాజకీయ పార్టీలు,తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్,ఆర్టీఐ,ఎన్ హెచ్ ఆర్సీ,అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ,జూనియర్ కళాశాల, అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్ వాడి కేంద్రాలు,వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అంగరంగవైభవంగా నిర్వహించారు. మూడురంగుల మువ్వవెన్నెల జెండాను ఎగురవేసి తెలంగాణ గీతాన్ని పాడారు.అనంతరం తెలంగాణ తల్లి, చిత్ర పటానికి, అమరవీరుల చిత్రపటాలకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆయా పార్టీల నాయకులు,తెలంగాణ ఉద్యమ కారులు,ఆర్టీఐ,అల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ, ఎన్ హెచ్ ఆర్సీ నాయకులు,యూత్ నాయకులు,ఉపాధ్యాయులు, విద్యార్థులు,ప్రజలు పెద్దయెత్తున  పాల్గొన్నారు.
Spread the love