వైభవోపేతంగా గోదాదేవి కళ్యాణం

నవతెలంగాణ – బెజ్జంకి 

భోగి పండుగా సందర్భంగా మండల కేంద్రంలోని స్థానిక లక్ష్మినరసింహ స్వామి ఆలయంలో భోగి పండుగ సందర్భంగా అదివారం గోదాదేవి కళ్యాణం ఆర్చకులు వైభోవపేతంగా నిర్వహించారు.ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ద్యావనపల్లి మంజుల దంపతులు,ఆలయ ధర్మ కర్తల కమిటి చైర్మన్ బండారి రాములు హజరై హజరై ప్రత్యేక పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డ్ సభ్యులు,గ్రామస్తులు హజరయ్యారు.
దాచారంలో..
దాచారం గ్రామంలోని శ్రీ సీతరామచంద్ర ఆలయంలో గోదాదేవి కల్యాణోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు.సర్పంచ్ పెంటమీది శ్రీనివాస్ దంపతులు హజరై ప్రత్యేక పూజలు చేశారు.గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హజరై పూజల్లో పాల్గొన్నారు.
Spread the love