ఉత్తమ హెల్త్ మహిళ ఉద్యోగులకు గోల్డ్ మెడల్స్ అందజేత 

– ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ  నిర్వహణ
నవతెలంగాణ- మల్హర్ రావు
సాయిత్రిబాయి పూలే 194వ జయంతి వేడుకలు పురస్కరించుకుని ఆల్ ఇండియా ఆల్ ఎంప్లాయిస్ వెల్పేర్ సొసైటీ రిజిస్ట్రేషన్ నెంబర్ 542. జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కె.వెంకటస్వామి, ప్రధాన కార్యదర్శి ఎం.లక్ష్మన్ చేతులమీదుగా  కాళేశ్వరం జోనల్ మల్హర్ మండల కేంద్రమైన తాడిచెర్ల ప్రాథమిక ప్రభుత్వ ఆరోగ్య కేంద్రము నుంచి  ఉత్తమ మహిళ ఉద్యోగులుగా ఎంపికైన మాచెర్ల సాధన సెకండ్ ఏఎన్ఎం, నల్లి సరితా రెండవ ఏఎన్ఎం,ఇందారపు రాజేశ్వరి ఆశా కార్యకర్త ముగ్గురు తాడిచెర్ల గ్రామానికి చెందిన వీరికి గోల్డ్ మెడల్స్, ప్రసంశ పత్రాలు,అవార్డులు,శాలువాతో ఘనంగా సన్మానాలు,పూలే జీవిత చర్తిత్ర గ్రంధం అందజేసినట్లుగా ఎంపిక కమిటీ సభ్యులు సీనియర్ జర్నలిస్ట్, జాతీయ మానవ హక్కుల మండలి మండల అధ్యక్షుడు చింతల కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు బండి సుధాకర్ లు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ..మహానీయురాలు సావిత్రీబాయి పూలే 194 జయంతిని పురస్కరించుకుని పెద్దపల్లి జిల్లా కేంద్రములోని అమర్ చంద్ కల్యాణ మండపం జెండా చౌరస్తాలో ప్రశంస పత్రాలు, మెమెంటోలు అందజేసినట్లుగా తెలిపారు.

Spread the love