- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 23వ విడత నగదును జూన్ 20వ తేదీన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ చేయనుంది. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లా తారకేశ్వర్లో జరిగే బహిరంగ సభలో ప్రధాని ఈ నిధులను విడుదల చేయనున్నారు. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ప్రక్రియ ద్వారా ఈ ఆర్థిక సహాయం అందనుంది.
- Advertisement -



