దీదీపై పరువునష్టం దావా వేసిన పశ్చిమ బెంగాల్ గవర్నర్

నవతెలంగాణ – హైదరాబాద్: బెంగాల్ లో గవర్నర్ వర్సెస్ ముఖ్యమంత్రి ఫైటింగ్ ముదురుతోంది. గవర్నర్ సీవీ ఆనంద బోస్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మధ్య కొనసాగుతున్న వివాదం తాజాగా కోర్టు మెట్లెక్కింది. సీఎం మమత వ్యాఖ్యలు తన పరువుకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ గవర్నర్ కలకత్తా కోర్టులో దావా వేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఓ ప్రజాప్రతినిధి అనుచిత వ్యాఖ్యలు, ప్రజలను తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయడం సరికాదని గవర్నర్ తీవ్రంగా మండిపడ్డారు.

Spread the love