సీఎంపై గవర్నర్‌ ఘాటు వ్యాఖ్యలు..

నవతెలంగాణ – కోల్‌కతా: అక్రమ సంబంధం ఆరోపణతో ఓ వ్యక్తితో పాటు మహిళను నడి రోడ్డుపై చావబాదిన ఘటన పశ్చిమబెంగాల్‌లో అగ్గి రాజేస్తోంది. దీనిని కారణంగా చూపుతూ.. గవర్నర్‌ ఆనంద్‌ బోస్‌.. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ఎంబీ కాక్‌టైల్‌’తో రాష్ట్రంలో శాంతిభద్రతలు కొరవడుతున్నాయని విమర్శించారు. తొలుత బాధితురాలని పరామర్శించేందుకు ఆమె ఇంటికి వెళ్లాలని నిర్ణయించిన గవర్నర్‌.. పోలీసుల సూచన మేరకు ఆగిపోయారు. బాధితురాలు ప్రస్తుతం ఒంటరిగా ఉండాలని కోరుకుంటోందని అధికారులు తెలియజేయడంతో ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ‘‘ బాధిత మహిళ ఎవరినీ కలవకుండా ఒంటరిగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం అందింది. ఆమె నిర్ణయాన్ని గౌరవించి నేను వెళ్లలేదు. ఆమె రాజ్‌భవన్‌కు ఎప్పుడైనా రావొచ్చు. లేదంటే నేను వెళ్లేందుకైనా సిద్ధమే’’ అని గవర్నర్‌ మీడియాకు తెలిపారు.

Spread the love