ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే జీతాలు చెల్లించాలి

– ఎన్ హెచ్ ఎం రాష్ట్ర నాయకుడు ఎస్ బాలసుబ్రమణ్యం
నవతెలంగాణ -సుల్తాన్ బజార్ 

ఎన్ హెచ్ ఎం ఉద్యోగులకు ప్రభుత్వం వెంటనే  జీతాలు చెల్లించాలని ఎన్ హెచ్ ఎం  రాష్ట్ర నాయకులు ఎస్ బాలసుబ్రమణ్యం అన్నారు. బుధవారం  కోఠి లో ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల ఒకటో తేదీన జీతాలు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటివరకు జీతం రాక ఎన్ హెచ్ ఎం ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇప్పటికైనా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, ఎన్ హెచ్ ఎం శాఖ డైరెక్టర్ కర్ణన్, డి హెచ్ డాక్టర్ రవీందర్ నాయక్ దృష్టిసారించి ఉద్యోగులందరికీ జీతాలు చెల్లించేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్ హెచ్ ఎం ఉద్యోగులందరి రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love