ఘనంగా గాంధీ జయంతి వేడుకలు

నవతెలంగాణ- పెద్దవంగర:
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. చిట్యాల గ్రామంలోని గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గాంధీ అహింస మార్గంతోనే దేశానికి స్వాతంత్య్రం సాధించామని, ప్రతిఒక్కరూ మహాత్ముడిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగినప్పుడే దేశం సర్వోన్నతి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఈదురు లచ్చమ్మ, పంచాయతీ కార్యదర్శి రాజు, వార్డు సభ్యులు ఈదురు మంజుల, మాజీ వార్డు సభ్యులు కొయ్యేడి వీరయ్య, కొయ్యేడి రాంమూర్తి, కొయ్యేడి రామక్క, నాయకులు మొగులగాని హరీష్, వల్లపు పరమేష్, కోతి రాజు, కొల్లూరి నారాయణ, గౌడ సంఘం అధ్యక్షుడు రాయిపెల్లి సత్యనారాయణ, రమేష్, ఆవుల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Spread the love