ఉన్నత పాఠశాలలో ఘనంగా గురుపూజోత్సవం 

నవతెలంగాణ – అశ్వారావుపేట
భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధా క్రిష్ణ జన్మదినం సందర్భంగా నిర్వహించే గురుపూజోత్సవాన్ని మంగళవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.ముందుగా జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం సర్వేపల్లి రాధాక్రిష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.తదుపరి ఉపాద్యాయులు అందరు ప్రధానోపాధ్యాయులు నరసింహా రావును శాలువాతో సన్మానించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు పత్తేపరపు రాంబాబు, బాలు , అప్పారావు, గణేష్, శుభ వాణి లు పాల్గొన్నారు.
Spread the love