ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్, మండల పరిషత్, కొయ్యుర్ పోలీస్ స్టేషన్, పీఏసీఎస్ కార్యాలయం, కొయ్యుర్ అటవీశాఖ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రము, బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ కంపెనీ, అన్ని గ్రామ పంచాయతీల్లో, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను, మూడు రంగుల మువ్వేన్నల జెండాను ఎగురవేసి ఘనంగా శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మల్హర్ రావు, జెడ్పీటీసీ కోమల, తహశీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ నరసింహమూర్తి, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, జాతీయ మానవ హక్కుల సంఘం నాయకులు, సమాచార చట్టం రక్షణ వేదిక నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Spread the love