ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ- తాడ్వాయి 
తాడ్వాయి మండలంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తాడ్వాయి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కౌడి రవి ,తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ సునీత, పోలీస్ స్టేషన్లో ఎస్సై ఆంజనేయులు, తాడువాయి సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో చైర్మన్ కపిల్ రెడ్డి, ఎర్ర పహాడ్, తాడ్వాయి, నందివాడ, దేమికలాన్, బ్రాహ్మణపల్లి, చిట్యాల, కృష్ణాజివాడి, బ్రహ్మాజీ వాడి, కన్కల్ గ్రామాల్లో సర్పంచులు నర్సారెడ్డి ,సంజీవులు, స్వాతి, పౌరాజు, కవిత, రాధ,జ్యోతి, ఇందిరా, భాగ్యలక్ష్మి లు గ్రామపంచాయతీ ఆవరణలో జెండాలు ఎగరవేశారు కృష్ణాజివాడి ఉన్నత పాఠశాలకు ప్రతినిధులు శివాజీ రావు రాజయ్య లు విద్యార్థులకు రూ.1.60 లక్షల విలువైన దుస్తులు, మైక్ సెట్ విరాలంగా అందించారు. – అలరించిన నృత్యాలు – తాడ్వాయి మండల కేంద్రంలోని రవీంద్రభారతి పాఠశాలలో విద్యార్థులు నిర్వహించిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి విద్యార్థులు వివిధ రకాల నాయకుల వేషధారణలో అందరినీ ఆకర్షించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఆది స్వామి కరస్పాండెంట్ భాస్కర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు
Spread the love