ఎంపీ సురేష్ శెట్కార్ కు ఘన సన్మానం..

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కార్ ను హైదరాబాద్ లోని ఆయన స్వగృహంలో గురువారం రోజున కామారెడ్డి జిల్లా వీర శైవ లింగాయత్ కార్యదర్శి, మండల నాయకులు మల్లప్ప పటేల్ శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. లింగాయత్ లను ఓబీసీ లో చేర్చడానికి కృషి చేయాలని కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. లింగాయత్ సమాజానికి ఎంపి షెట్కార్ చేసిన సేవలు మరువలేమన్నారు. ఆయన కృషివల్లనే  2009లో అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజ శేఖర్ రెడ్డి లింగాయత్ లను బీసీలో చేర్చారని తెలిపారు. అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఒప్పించి లింగాయత్ ల కోసం కార్పొరేషన్ ఏర్పాటు చేయించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగాయత్ నాయకులు సంతోష్ పటేల్,ఆకాష్ పటేల్,పవన్ దేశాయ్ పాల్గొన్నారు.
Spread the love