ఓటుతో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి: ఎంపీపీ ప్రతాప్ రెడ్డి

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని ఎంపీపీ ప్రతాప్ రెడ్డి అన్నారు. బుధవారంరోజున మండలంలోని అంజని,శివాపూర్,తలాప్తాండచావనీతాండ,పోచారం,పోచారం తాండ, గ్రామాల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ కు మద్దతుగా కారు గుర్తుకు ఓటు వేయాలని ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమలుకాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు నెలలు గడుస్తున్నా ఏ ఒక్క హామీ అమలు చేయలేదని మండిపడ్డారు.బీఆర్ఎస్అధినేత కేసీఆర్ పదేళ్ల క్రితం తెలంగాణలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు సరఫరా చేశారన్నారు.రైతుబంధు కింద రూ.15వేలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వంరైతులనుమోసం చేసిందన్నారు.కారుగుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడువిజయ్ దేశాయ్, సొసైటీ చైర్మన్ హనుమంత్ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కండేరావు పటేల్, సాయ గౌడ్,మహ్మద్,అశోక్ పటేల్,బిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love