నిత్య అన్నదానానికి పెరుగుతున్న ఆదరణ..

నవతెలంగాణ- అచ్చంపేట : శ్రీశైలం ఉత్తర ధారంగా పేరుగాంచిన మండల పరిధిలోని శ్రీ ఉమామహేశ్వర క్షేత్రంలో నిర్వహిస్తున్న నిత్య అన్నదాన కార్యక్రమానికి భక్తుల, పర్యాటకుల ఆదరణ పెరుగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్,  కార్య నిర్వహణ కార్యదర్శి శ్రీనివాసరావు లు తెలిపారు. కార్తీక మాసం పురస్కరించుకొని ప్రత్యేకంగా ప్రత్యేక పూజలు,  మహిళలు దీపారాధనలు చేస్తున్నారు. ప్రతిరోజు వెయ్యికి పైగా భక్తులు పర్యటకులు నిత్యాన్నదాన చేస్తున్నారు. కార్తీకమాసం చివరి రోజు సోమవారం అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు.
Spread the love