Monday, June 1, 2026
E-PAPER
Homeఆటలుగుజరాత్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

గుజరాత్‌ ఆటగాళ్లకు తప్పిన ప్రమాదం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గుజరాత్ టైటాన్స్‌ ఆటగాళ్లకు ప్రమాదం తప్పింది. వారు ప్రయాణిస్తున్న బస్సులో మంటలు చెలరేగిన ఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దీంతో వెంటనే ఆటగాళ్లు, సహాయక సిబ్బంది బస్సులో నుంచి దిగిపోయారు. షార్ట్ సర్క్యూట్‌ కారణంగా తొలుత పొగలు వచ్చాయి. వెంటనే ఆటగాళ్లు అలర్ట్ అయిపోయారు. బస్సు దిగిన తర్వాత మంటలు రేగాయి. కాసేపు తర్వాత ప్లేయర్లు మరో బస్సులో తాము బస చేసిన హోటల్‌కు వెళ్లిపోయారు.  

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -