జిల్లా ప్రజలకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

– ఎంపీపీ ఫోరం అధ్యక్షురాలు 
నవతెలంగాణ – ఆళ్ళపల్లి
ప్రపంచ వ్యాప్తంగా సోమవారం బక్రీద్ పండుగ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముస్లిం సోదర, సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు ఎంపీపీ ఫోరం జిల్లా అధ్యక్షురాలు, స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ.. బక్రీద్ పండుగ అనేది త్యాగానికి ప్రతీక అని చెప్పారు. అందులో భాగంగానే ఖుర్బానీ కార్యక్రమం చేయడం జరిగుతుందని, దైవాన్ని విశ్వసించడం, మానవులంతా ఒక్కటే అని నమ్మడం, బిడ్డల బాధ్యతలు, పొరుగు వారి హక్కులు, పేదల హక్కులు నెరవేర్చడం, చెడును నిరోధించడం, మంచిని పెంచడం, కష్టాలలో సహనం వహిస్తూ, త్యాగ నిరతిని చూపించాలి అన్న సందేశమే ఈ బక్రీద్ పండుగ సందర్భంగా ఇచ్చే ఖుర్భానీలో దాగి ఉందని వ్యాఖ్యానించారు. జిల్లాలోని ముస్లింలు ముఖ్యంగా నిరుపేదలు సైతం ఉన్న దాంట్లో మెరుగ్గా నూతన వస్త్రాలు ధరించి పండుగను సుఖ సంతోషాలతో ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.
Spread the love