నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
వేలాది అమరుల త్యాగఫలం, లక్షలాది మంది ఉద్యమకారుల పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. మిలియన్ మార్చ్, సకల జనుల సమ్మె, రైల్ రోకోచ చలో అసెంబ్లీ, వంటా-వార్పు, సాగర హారం, సడక్ బంద్, సహాయ నిరాకరణ, సంసద్ యాత్రలు తదితర తెలంగాణ ఉద్యమ కీలక ఘట్టాలను ఆయన గుర్తుచేసుకున్నారు.